ఐపీఎల్ తరహాలో 12 నగరాల్లో ప్రొ కబడ్డీ లీగ్

  • డిసెంబర్ 2 నుంచి పదో సీజన్
  • సెప్టెంబర్ 8, 9వ తేదీల్లో ఆటగాళ్ల వేలం
  • తొమ్మిది సీజన్లలో మూడుసార్లు విజతగా పాట్నా పైరేట్స్
దేశంలో ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి ఆదరణ దక్కించుకున్న టోర్నీ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌). గత తొమ్మిది సీజన్లలో ఈ లీగ్ చాలా ఉత్సాహంగా సాగింది. అయితే, కరోనా కారణంగా రెండేళ్లు గా మెగా లీగ్ ను పరిమిత వేదికల్లో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే పదో సీజన్ ను తిరిగి ఐపీఎల్ మాదిరిగా పోటీలో ఉన్న 12 జట్లకు చెందిన నగరాల్లో నిర్వహించాలని ఆర్గనైజర్స్ నిర్ణయించారు. 

పీకేఎల్‌ పదో సీజన్‌ను డిసెంబర్‌ 2 నుంచి ప్రారంభించనున్నట్లు లీగ్‌ కమిషనర్‌ అనుపమ్‌ గోస్వామి వెల్లడించారు. త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో పీకేఎల్ వేలం జరుగుతుందని తెలిపారు. గత తొమ్మిది సీజన్లు విజయవంతమయ్యాయని, పదో సీజన్ అందరికీ గుర్తుండిపోయేలా ఉండబోతోందన్నారు. ఇప్పటిదాకా జరిగిన తొమ్మిది సీజన్లలో పాట్నా పైరేట్స్ మూడు టైటిల్స్ గెలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.

Pro Kabaddi League
December 2
10th season

More Telugu News